Roja : మాజీ మంత్రి రోజా పై మంత్రి దుర్గేశ్ ఫైర్

Roja : రోజాకు పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు

Published By: HashtagU Telugu Desk
Kandula Roja

Kandula Roja

మాజీ మంత్రి రోజా (Roja) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) దావోస్ (Davos) సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను ఎందుకు తీసుకెళ్లలేదని రోజా చేసిన ప్రశ్నను ఆయన తప్పుబట్టారు. రోజాకు పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండిన రోజా రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆచరణలో చూపించని నాయకత్వానికి విమర్శలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

Deputy CM Bhatti : తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రం అవమానించింది.. ‘పద్మ అవార్డుల’పై డిప్యూటీ సీఎం భట్టి స్పందన

రిషికొండలో జగన్ భవనాలు నిర్మాణం జరుగుతున్నప్పుడు రోజా ఎందుకు నోరు మెదపలేదని దుర్గేశ్ ప్రశ్నించారు. రిషికొండ భవనాల వల్ల పర్యాటక శాఖ నష్టపోయిందని, రాష్ట్రానికి వచ్చిన ఆర్థిక నష్టానికి రోజా కూడా సమాధానం చెప్పాలన్నారు. సార్వత్రిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రోజాకు ఇప్పుడు విమర్శలు చేసే హక్కు లేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని మంత్రి దుర్గేశ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగే ముందు, తన గతం గురించి రోజా ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. పవన్ గురించి విమర్శలు చేయడం కంటే రాష్ట్రానికి ఎలా సహాయం చేయగలమన్న దానిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.

  Last Updated: 26 Jan 2025, 03:23 PM IST