అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా మంత్రి ఎర్రబెల్లిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2 న ఆటా మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు వేల్పుకొండ వెంకటేష్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలుసుకొని బొకే అందించి, అభినందనలు తెలిపారు. ఆటా మహాసభల్లో ఎర్రబెల్లి పాల్గొనడం ఆనందిచగ్గ విషయమన్నారు. ఆయన అమెరికా పర్యటన హ్యాపీగా సాగాలని వెంకటేశ్ ఆకాక్షించారు.