Site icon HashtagU Telugu

PM Modi : మోడీపై 100 మంది బ్యూరోక్రాట్స్ తిరుగుబాటు

Pm Modi

Pm Modi

ద్వేష‌పూరిత రాజ‌కీయాలను నిర‌సిస్తూ 100 మంది మాజీ సివిల్ స‌ర్వెంట్లు(ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్‌, ఐఎఫ్ఎస్‌) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి లేఖాస్త్రాన్ని సంధించారు. “దేశంలో ద్వేషంతో నిండిన విధ్వంసం, ఉన్మాదాన్ని చూస్తున్నాం. ముస్లింలు , ఇతర మైనారిటీ వర్గాల‌పై జ‌రుగుతోన్న దాడుల‌ను ఆ లేఖ‌లో పొందుప‌రిచారు.ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జికె పిళ్లై, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టికెఎ నాయర్ సహా 108 మంది లేఖపై సంతకాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

అస్సాం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మరియు కొన్ని నెలలుగా మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషపూరిత హింస పెరిగింది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో ఉంద‌ని మాజీ బ్యూరోక్రాట్‌లు పేర్కొన్నారు.సామాజిక ముప్పును ఎదుర్కొనే మీ మౌనం చెవిటిది” అని లేఖలో పేర్కొన్నారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి, జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను మీ మనస్సాక్షికి విజ్ఞప్తి చేస్తున్నాము” అని మోడీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. పక్షపాత ఆలోచనలకు అతీతంగా సాగుతున్న ఈ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో మీ పార్టీ ఆధీనంలోని ప్రభుత్వాలు ఆచరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలనే పిలుపునిస్తారని ఆ లేఖలో ఆశిస్తున్నామంటూ ముగించారు.

Exit mobile version