అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఛతీస్ఘడ్లో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు J.P. మౌర్య, రాను సాహు నివాస స్థలాలు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల ప్రాంగణంలో కూడా ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.