Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని తవాంగ్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది.

  • Written By:
  • Updated On - July 22, 2023 / 09:30 AM IST

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని తవాంగ్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.3గా నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైంది. ఉదయం 06:56 గంటలకు ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది

NCS ప్రకారం.. భూకంపం ఉదయం 6.56 గంటలకు సంభవించింది. 5 కిలోమీటర్ల లోతులో ఉంది. అరుణాచల్‌లో భూకంపం తీవ్రత 3.3గా నమోదైందని ఎన్‌సీఎస్‌ ట్వీట్‌ చేసింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Also Read: Andhra Pradesh : పోలవరం మండలాల్లో వరద బీభత్సం.. ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే ధ‌న‌ల‌క్ష్మీ ప‌ర్య‌ట‌న‌

జైపూర్‌లో అరగంటలో మూడు భూకంపాలు

అంతకుముందు శుక్రవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. జైపూర్‌లో ఉదయం 4.09 గంటలకు 10 కి.మీ లోతులో 4.4 తీవ్రతతో మొదటి ప్రకంపనలు సంభవించగా, 3.1 తీవ్రతతో రెండవ ప్రకంపనలు, తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో 3.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. NCS ప్రకారం ఇది 10 కి.మీ లోతులో ఉంది. ఆ సమయంలో ప్రజలు నిద్రపోతున్నారు. ప్రకంపనలు రావడంతో ప్రజలు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మొదటి సారి 4.4, రెండవ సారి 3.1, మూడవసారి 3.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.