Site icon HashtagU Telugu

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి

Srinivas Madhuri

Srinivas Madhuri

మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), మాధురి (Madhuri) జంటగా వచ్చి తిరుమల శ్రీవారి(Tirumala Srivari)ని దర్శించుకున్నారు. గత కొద్దీ నెలలుగా దువ్వాడ ఇంట్లో వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మాధురి మోజులో పడి తమకు అన్యాయం చేశాడంటూ భార్య , పిల్లలు రోడ్డెక్కారు. ఆఖరికి ఇంటిని సైతం మధురైకి రాసిచ్చి..తమకు ఏమిలేకుండా చేసాడని వారంతా వాపుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం శ్రీవారిని జంటగా వచ్చి మరోసారి వార్తలో నిలిచారు శ్రీనివాస్ అండ్ మాధురి. బ్రహ్మోత్సవాలను తనివీతీరా చూసేందుకు తిరుమలకు వచ్చామని , శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామని , ప్రజలందరికి శాంతిసౌకర్యాలు చేకూర్చాలని శ్రీనివారిని కోరుకున్నట్లు శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తన సతీమణి వాణితో కాకుండా మాధురితో కలసి రావడంతో తిరుమలలో చూసిన భక్తులు దీనిపై చర్చించుకుంటున్నారు.

Read Also : Dasara Weekend : ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్, వెబ్ సిరీస్‌లు ఇవే