Srisailam: శ్రీశైలంలో దసరా ఉత్సవాలు

శ్రీశైలంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.

  • Written By:
  • Updated On - September 9, 2022 / 02:27 PM IST

శ్రీశైలంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 4న రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. వేడుకల రోజుల్లో అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గల అలంకరణ చేయనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. భారీగా భక్తులు రానుండటంతో వాహనాల పార్కింగ్, మంచినీటి సదుపాయం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు దృష్టిసారించారు.