Telangana : నాగ‌ర్‌క‌ర్నూల్‌లో ఓ ల్యాబ్‌పై డీఆర్ఐ అధికారుల త‌నిఖీలు.. భారీగా..?

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో ఓ ల్యాబ్‌పై డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో 31 కిలోల ఆల్ప్రజోలం

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 06:58 AM IST

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో ఓ ల్యాబ్‌పై డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో 31 కిలోల ఆల్ప్రజోలం స్వాధీనం చేసుకున్నారు. ప‌క్కా సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో వ్యవసాయ పొలాల మధ్య మారుమూల కోళ్ల ఫారంలో ఉన్న యూనిట్‌పై దాడి చేశారు. ఈ దాడి ఫలితంగా 31.42 కిలోల అల్‌ప్రాజోలమ్‌ను పూర్తి ఉత్పత్తిగా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 3.14 కోట్లు గా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు..ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.