Site icon HashtagU Telugu

Delhi On High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. ఉగ్రదాడి ముప్పు ఉందా..?

Delhi On High Alert

Delhi On High Alert

Delhi On High Alert: జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో శివఖోడి నుంచి వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్రమత్తమైన వాతావరణం నెలకొంది. ఈ దాడిలో డ్రైవర్‌తో సహా 10 మంది భక్తులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న భద్రతా బలగాలకు భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించడంతో ఢిల్లీలో కూడా హై అలర్ట్ (Delhi On High Alert) ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో కఠినంగా వ్యవహరించిన ఉగ్రవాదులు ఢిల్లీలో భారీ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు సూచించాయి. ఈ దాడికి బాధ్యతను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అనుబంధం ఉన్న టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తీసుకుంది ఆ తర్వాత పాకిస్తాన్ ఎదురుదాడికి భయపడుతోంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దాడి చేస్తుందన్న భయంతో పాకిస్థాన్‌.. భారత్‌తో సరిహద్దును మూసివేసింది. అలాగే సరిహద్దుల్లో పాక్ సైన్యం గట్టి నిఘాను ప్రారంభించింది.

6 కిలోల పేలుడు పదార్థాలతో 2 ఐఈడీలను భద్రతా బలగాలు గుర్తించాయి

రియాసి దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం వెతకడానికి కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా దళాలు కీలక వస్తువులను కనుగొన్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, CRPF కమాండోల సంయుక్త బృందం ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలను కనుగొన్నారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాద సహాయకులపై జరిపిన దాడిలో భద్రతా బలగాలు అనేక AK-47 రైఫిల్స్, ఇతర ఆయుధాలను పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు కూడా కనుగొనబడ్డాయి. వీటిలో 6 కిలోల రెండు అత్యంత ఘోరమైన IEDలు ఉన్నాయి. ఆర్మీ వాహనాలను పేల్చివేయడానికి ఈ ఐఈడీలను ఉపయోగించాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో హై అలర్ట్ ప్రకటించారు.

Also Read: T20I Rankings: జస్ప్రీత్ బుమ్రాకు బిగ్ షాక్.. టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-100లో నో ప్లేస్..!

ఢిల్లీలోని మాల్స్, మార్కెట్లలో భద్రతను పెంచారు

మతపరమైన ప్రదేశాలతో పాటు మాల్స్, మా ర్కెట్లలో భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిని ఉటంకిస్తూ జీ న్యూస్ నివేదిక తెలిపింది. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉగ్రవాదులు త్వరలో ఎక్కడైనా భారీ దాడికి పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అధికారి మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రియాసిలో జరిగిన ఉగ్రదాడికి పెద్ద అర్థం ఉంది. దీంతో ఢిల్లీలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిలో ఉగ్రవాదులు చేసే ఎలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నిఘాను కొనసాగిస్తున్నామన్నారు పోలీసులు.

ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కూడా యాక్టివ్‌గా మారింది

రియాసి దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో సోదాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా అక్కడి ఉగ్రవాదుల ప్లాన్‌ల సమాచారాన్ని సేకరించడం ప్రారంభించాయి. ఢిల్లీలోని కాశ్మీరీ టెర్రరిస్టులకు సహకరించేవారిపై ఉచ్చు బిగించడం ద్వారా లీడ్స్ సేకరించేందుకు ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కూడా చురుకుగా మారింది. స్పెషల్ సెల్ కూడా చాలా చోట్ల రహస్య దాడులు నిర్వహించింది. వాటి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.

We’re now on WhatsApp : Click to Join

పాకిస్థాన్ భయపడుతోంది

రియాసిలో ఉగ్రదాడి తర్వాత భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాకిస్థాన్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ భయం పట్టుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మాజీ ప్రధాని రాజా మహ్మద్ ఫరూక్ అహ్మద్ దార్ సోషల్ మీడియాలో ఈ భయాన్ని వ్యక్తం చేశారు. రియాసి దాడి తర్వాత పాకిస్థాన్ ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉండాలని దార్ తన ట్వీట్‌లో రాశారు. అయితే, పాకిస్థాన్ సైన్యం కూడా భారత్ ఎదురుదాడికి భయపడుతోంది. దీని కారణంగా పాక్ ఆర్మీ పీఓకే పక్కనే ఉన్న భారత సరిహద్దును మూసివేసి, అక్కడ పెట్రోలింగ్‌ను మరింత కఠినతరం చేసింది. పాక్ ఆర్మీ ప్రోద్బలంతో పీఓకేలో పెద్ద ఎత్తున ఉగ్రవాద సంస్థల బేస్ క్యాంపులు ఉన్నాయని, వీటిని ఉగ్రవాద సంస్థలు భారత సరిహద్దులోకి చొరబడి ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతున్నాయి. 2015లో ఉరీ దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఇలాంటి శిబిరాలు నేలమట్టమయ్యాయి.

Exit mobile version