అనేక దేశాల్లో కేసుల పెరుగుదలకు కారణమయ్యే కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బిఎఫ్.7 కరోనా వైరస్ ఇప్పటి వరకు ఢిల్లీలో కనుగొనబడలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రధానమైన సబ్-వేరియంట్ XBB అని ఇది ఇప్పటివరకు 92 శాతం నమూనాలలో కనుగొనబడిందని తెలిపారు. అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితిపై కేజ్రీవాల్ తన నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం, 2,500 పరీక్షలు నిర్వహిస్తున్నారు మరియు కోవిడ్ కేసుల పెరుగుదల ఉంటే వీటిని లక్షకు పెంచుతామని తెలిపారు. కోవిడ్ రోగుల కోసం తమ వద్ద 8,000 పడకలు సిద్ధంగా ఉన్నాయని.. దాని గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో తాము 25,000 పడకలను సిద్ధం చేసామన్నారు, అయితే పడకల సామర్థ్యాన్ని 36,000కి పెంచే సామర్థ్యం ఉందన్నారు.
Covid -19 : కరోనాపై ఆందోళన చెందొద్దు.. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం – ఢిల్లీ సీఎం
అనేక దేశాల్లో కేసుల పెరుగుదలకు కారణమయ్యే కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బిఎఫ్.7 కరోనా వైరస్ ఇప్పటి వరకు ఢిల్లీలో

Arvind Kejriwal (2)
Last Updated: 23 Dec 2022, 08:11 AM IST