Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

  • Written By:
  • Publish Date - March 14, 2022 / 10:15 AM IST

ఇండియాలో థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ క‌రోనా కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,503 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌ క‌రోనా కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు 27 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అలాగే దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 4,377 మంది కోలుకున్నార‌ని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుద‌ల చేసింది.

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,24,43,952 కోట్ల‌ క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 5,15,877మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. అలాగే దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,24,41,449 కోట్ల మంది క‌రోనా నుంచి కోరుకున్నార‌ని స‌మాచారం. ఇక మ‌రోవైపు దేశంలో ప్ర‌స్తుతం ఇండియ‌లో 36,168 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌పోతే దేశం క‌రోనా పాజిటివిటీ రేటు 0.47% శాతం ఉంది. అలాగే రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో1,79,91,57,486 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.