Telangana: కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

  • Written By:
  • Updated On - December 22, 2021 / 03:53 PM IST

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగానికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్‌ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులందరిని పాస్ చేయాలని అయన లేఖలో కోరారు. కరోనా పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి 35 మార్కులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఆలస్యం చేయకుండా విద్యార్థు భవిష్యత్‌ కోసం తక్షణం నిర్ణయం తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.