Nirmal : నిర్మల్‌లో జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన కలెక్టర్

నిర్మల్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ శనివారం పర్యటించారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన భైంసా పట్టణంలో ఫరూఖీ పర్యటించారు.

Published By: HashtagU Telugu Desk
Collector Tours

Collector Tours

నిర్మల్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ శనివారం పర్యటించారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన భైంసా పట్టణంలో ఫరూఖీ పర్యటించారు. గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల నుంచి రెండు మిగులు జలాలను విడుదల చేశామన్నారు. భైంసా, బాసర, థానూరు మండలాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓ చోట చిక్కుకుపోయిన ఆరుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని, వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకువస్తామని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తారని తెలిపారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

  Last Updated: 10 Jul 2022, 03:13 PM IST