Site icon HashtagU Telugu

KCR New Schemes: మునుగోడు కోసం కేసీఆర్ ‘కొత్త పథకాలు’

Munugodu

Munugodu

మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే ఆయా పార్టీలు తమకు తోచినవిధంగా ప్రచారం చేస్తున్నాయి. మునుగోడును గెలుచుకొని తమకు తిరుగులేదని నిరూపించుకోవడానికి మూడు పార్టీలు ఊవిళ్లుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ సభలు, సమావేశాలు నిర్వహిస్తే, టీకాంగ్రెస్ ప్రియాంకను రంగంలోకి దింపాలని భావిస్తోంది. అయితే నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు కొత్త పథకాలను ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలపై చర్చించారు.

వివిధ పథకాల లబ్ధిదారుల పేర్లను జాబితా చేసి, లబ్ధి పొందని వారి పేర్లను జాబితా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు మునుగోడు పరిధిలో గోడ గడియారాలు, గొడుగులు పంచిన విషయం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మునుగోడు గెలుపు కోసం కేసీఆర్ ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతారు? అని మునుగోడు ప్రజలతో పాటు ఇతర పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version