CM KCR: శాంతిభద్రతల సమస్యపై సీఎం కేసీఆర్ అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు

గత కొద్ది రోజులుగా బీజేపీ నేతల వ్యాఖ్యలు, చర్యల కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా మారాయి.

Published By: HashtagU Telugu Desk
Kcr Imresizer

Kcr Imresizer

గత కొద్ది రోజులుగా బీజేపీ నేతల వ్యాఖ్యలు, చర్యల కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా మారాయి. ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న, మొన్న, రాత్రి, పగలు తేడా లేకుండా ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు పట్టణాల్లోనూ ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాజాసింగ్‌కు బెయిల్ రావడంతో పాతబస్తీలోని యువత మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు బండి సంజయ్ పాద యాత్ర కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంజయ్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు హింసకు దారితీస్తాయన్న నివేదికలతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

  Last Updated: 24 Aug 2022, 07:57 PM IST