Cloud Burst In Himachal: హిమాచల్ ప్రదేశ్లో కుండపోత.. 40 మంది గల్లంతు!

భారీ వ‌ర్షాల‌కు ఈరోజు మండిలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. కేంద్ర మంత్రి, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా హిమాచల్ సిఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Cloud Burst In Himachal

Cloud Burst In Himachal

Cloud Burst In Himachal: అస్సాం, కేరళ తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం (Cloud Burst In Himachal) సృష్టించింది. ఇక్కడ కులులోని నిర్మంద్ బ్లాక్, కులులోని మలానా, మండి జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల దెబ్బ‌కు ఇక్కడ భారీ విధ్వంసం జరిగింది. పలు ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. దాదాపు 40 మంది గల్లంతయ్యారు. మండిలో ఒక మృతదేహం లభ్యం కాగా, 35 మందిని సురక్షితంగా రక్షించారు.

భారీ వ‌ర్షాల‌కు ఈరోజు మండిలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. కేంద్ర మంత్రి, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా హిమాచల్ సిఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Wayanad Disaster : నేడు వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన..

జేపీ నడ్డా సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుతో మాట్లాడారు

హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో క్లౌడ్ బ్ర‌స్ట్‌ భారీ నష్టాన్ని కలిగించి, జనజీవనానికి అంతరాయం కలిగించిన తరువాత కేంద్ర మంత్రి, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా హిమాచల్ సిఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖుతో మాట్లాడి, సమాచారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుండి సాధ్యమైన అన్ని సహాయానికి హామీ ఇచ్చారు. జేపీ నడ్డా మాజీ సీఎం, ఎల్‌ఓపీ జైరామ్ ఠాకూర్‌తోనూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతోనూ మాట్లాడి బీజేపీ కార్యకర్తలందరూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆదేశించారు.

జైరామ్ ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు

ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఇలా రాశారు. ‘గత రాత్రి భారీ వర్షాల కారణంగా జిల్లా మండిలోని తాల్తుఖోడ్ సమీపంలోని రాజ్మాన్ గ్రామంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సమేజ్, బాగిపుల్ ప్రాంతాల్లో అనేక భవనాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. నిర్మాంద్‌లో చాలా మంది గాయపడ్డారు. చాలా మంది అదృశ్యం వార్త వినడానికి నేను చాలా బాధపడ్డాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గల్లంతైన వారు క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాను. రాష్ట్రవ్యాప్తంగా గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా విధ్వంసానికి గురైన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 01 Aug 2024, 10:51 AM IST