ఏపీ సీఐడీ పోలీసులు మాజీమంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 4 రోజులుగా ఫోన్ స్విఛాప్ చేసి నారాయణ అజ్ఙాతంలో ఉన్నారు.చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లికవ్వడంతో ఆ సంస్థ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్తోపాటు మరో ఇద్దరు అరెస్ట్ చేయగా…తాజాగా నారాయణ విద్యాసంస్థలు అధినేత నారాయణ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే కుటుంబ సభ్యులకు మాత్రం పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు