Mission Moon: త్వరలో చంద్రుడి పై చైనా రిసెర్చ్ సెంటర్!

చంద్రుడి పై రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు కు చైనా రెడీ అవుతోంది. ఈ దిశగా కసరత్తు ను ముమ్మరం చేసింది.

  • Written By:
  • Publish Date - April 29, 2022 / 02:05 PM IST

చంద్రుడి పై రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు కు చైనా రెడీ అవుతోంది. ఈ దిశగా కసరత్తు ను ముమ్మరం చేసింది. చాంగీ-8 మిషన్ లో భాగంగా త్వరలో చంద్రుడి పై రిసెర్చ్ సెంటర్ ను నిర్మిస్తామని చెబుతోంది. ప్రస్తుతం చాంగీ-6 మిషన్ పురోగతి లో ఉంది. ఇందులో భాగంగా.. భూమి నుంచి మనకు కనిపించని చంద్రుడికి వెనుక ప్రాంతం నుంచి ఉపరితల శాంపిళ్ళను సేకరించి, తెప్పించే పనిలో నిమగ్నమైంది. వాస్తవానికి 2019 జనవరిలోనే తొలిసారిగా చైనా కు చెందిన చాంగీ-4 లూనార్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి వెనుక భాగంలో దిగింది. నాటి నుంచే ఆ ప్రాంతపు స్వరూప స్వభావాలపై చైనా అధ్యయనం ప్రారంభించింది. ఈవిషయంలో అమెరికా, ఐరోపా, రష్యా లకు ధీటుగా పావులు కదుపుతోంది. భవిష్యత్ లో చంద్రుడి పై తన వంతు వాటా ను దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది.

ఆ రెండు శాటిలైట్లు ఎందుకంటే..

తాజాగా శుక్రవారం రోజున చైనా సీవీ 01, సీవీ 02 అనే రెండు ఉపగ్రహాలను విజయవంతం గా ప్రయోగించింది. పర్యావరణ పరిరక్షణ, నగరాల భద్రతతో ముడిపడిన సేవలు అందించే కంపెనీలకు ఇవి రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తాయి.