Goats Eye Horror : దారుణ ఘటన ఇది.. దయనీయ ఘటన ఇది..
ఇది ఏ తరహా ఘటన ?
మొత్తం వార్త చదివాక చెప్పండి !!
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా మదన్పూర్ లో ఒక ఘటన చోటుచేసుకుంది. బగద్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి మొక్కు నెరవేరింది. దీంతో సంతోషించిన అతడు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఖోపా ధామ్ ఆలయానికి వెళ్లి ఒక మేకను బలి ఇచ్చాడు. మేక మాంసాన్ని వండి తినడానికి కూర్చున్నారు. అప్పటివరకు అంతా సజావుగా సాగింది. భోజనం చేస్తుండగా.. మటన్ కూరలో మేక కన్ను(Goats Eye Horror) వచ్చింది. దాన్ని చూసిన బగద్ సాయి నోట్లో వేసుకొని మింగడానికి ప్రయత్నించాడు.
Also read : Anil Ambani-Pandora Papers case : అనిల్ అంబానీని వెంటాడుతున్న “పండోరా పేపర్స్”.. ఏమిటివి ?
అయితే ఊహించని విధంగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో బగద్ సాయి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఊపిరి పీల్చుకోలేక విలవిలలాడుతున్న అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గొంతులో ఇరుక్కున్న మేక కన్నును తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తుండగానే బగద్ సాయి శ్వాస ఆగిపోయింది. అతడు చనిపోయాడు. అతడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయిన