Chandrababu: మునిరాజమ్మకు చంద్రబాబు రూ. 5 లక్షల సాయం!

  • Written By:
  • Updated On - March 4, 2023 / 04:42 PM IST

శ్రీకాళహస్తి లో వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్భలంతో దాడికి గురైన బీసీ మహిళ మునిరాజమ్మ నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. ఆమె హోటల్ ధ్వంసం చేసి, భర్తను ఉద్యోగం నుంచి తొలగించి బీసీ కుటుంబం పొట్టపై కొట్టిన ఎమ్మెల్యే అరాచకాలను చంద్రబాబు వివరించారు. ఆమె బాధలు విన్న చంద్రబాబు అధైర్య పడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ తక్షణమే 5 లక్షల రూ. సాయం అందించారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.