Site icon HashtagU Telugu

Telangana Girl@UPSC: సివిల్స్‌లో 161 వ ర్యాంక్ సాధించిన తెలంగాణ అమ్మాయి

chaitanya reddy

chaitanya reddy

యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష 2021లో రాష్ట్ర నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ బొక్క చైతన్య రెడ్డి 161వ ర్యాంకు సాధించారు. వరంగల్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) నుంచి బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) గ్రాడ్యుయేట్ అయిన చైతన్య రెడ్డి తన మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

జిల్లా సహకార అధికారిగా పనిచేస్తున్న బొక్క సంజీవ రెడ్డి, సంస్కృత అధ్యాపకురాలు వినోద దంపతుల కుమార్తె. వీరి కుటుంబం హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని విద్యారణ్యపురి ప్రాంతంలో నివాసం ఉంటోంది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట గ్రామానికి చెందిన సంజీవరెడ్డి 20 ఏళ్ల క్రితం హన్మకొండలో స్థిరపడ్డాడు.

త‌న తండ్రి గ్రూప్‌-1 ఆఫీసర్‌ కావడంతో చిన్నప్పటి నుంచి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యేలా త‌నను, సోద‌రుడిని ప్రోత్సహించారని చైత‌న్య రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత మల్లవరపు ఆధ్వర్యంలో ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకున్నట్లు చైతన్య రెడ్డి తెలిపారు.