Site icon HashtagU Telugu

Kishan Reddy: కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్!

రాజకీయనాయకులపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్నింటినీ తాను పాటిస్తున్నానని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. ప్రతిఒక్కరూ విధిగా టీకా తీసుకోవాలని కోరారు.