One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని (JPC) నియమకాం?

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 31 మంది ఎంపీలను చేర్చారు, అందులో 21 మంది లోక్‌సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
One Nation One Election

One Nation One Election

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జమిలి ఎన్నికల (One Nation, One Poll) బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులుగా ఉంటాయి, వాటికి ఆమోదం పొందాలంటే మూడింట రెండోవంతు మెజారిటీ అవసరం.

ఈ నేపథ్యంలో, ఈ బిల్లులపై సమగ్ర చర్చల కోసం వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు, అధ్యయనం చేయడానికి JPC ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

ఈ కమిటీ మొత్తం 31 మంది ఎంపీలతో ఉండగా, అందులో 21 మంది లోక్‌సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పించబడింది. జమిలి ఎన్నికల బిల్లుపై మూడు నెలల కాలపరిమితితో ఈ కమిటీకి అధ్యయనం చేయాలని సూచించబడ్డింది. జేపీసీ సభ్యుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది.

  Last Updated: 18 Dec 2024, 02:36 PM IST