కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జమిలి ఎన్నికల (One Nation, One Poll) బిల్లును మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులుగా ఉంటాయి, వాటికి ఆమోదం పొందాలంటే మూడింట రెండోవంతు మెజారిటీ అవసరం.
ఈ నేపథ్యంలో, ఈ బిల్లులపై సమగ్ర చర్చల కోసం వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు, అధ్యయనం చేయడానికి JPC ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
ఈ కమిటీ మొత్తం 31 మంది ఎంపీలతో ఉండగా, అందులో 21 మంది లోక్సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పించబడింది. జమిలి ఎన్నికల బిల్లుపై మూడు నెలల కాలపరిమితితో ఈ కమిటీకి అధ్యయనం చేయాలని సూచించబడ్డింది. జేపీసీ సభ్యుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది.