మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోనూ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. నార్సింగీ రోటరీ వద్ద కోటి రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. కోకాపేట నుండి నార్సింగీ మీదుగా హైదరాబాద్ వెళుతున్న కార్లలో భారీగా డబ్బుల కట్టలు ఉన్నాయి. ఈ కార్ల డ్రైవర్లు చెక్ పోస్టుల వద్ద పోలీసులను చూసి వేగం పెంచారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు కార్లను చేజ్ చేసి పట్టుకున్నారు. కారుల్లో ఉన్న బ్యాగుల్లో కోటి రూపాయల నగదును పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురు తప్పించుకున్నారు.