Video: మాదాపూర్ లో హోటల్ పై దాడి.. కేసు నమోదు!

బుధవారం రాత్రి మాదాపూర్‌లో హోటల్ నిర్వాహకులను బెదిరించి,

  • Written By:
  • Updated On - March 3, 2022 / 04:10 PM IST

బుధవారం రాత్రి మాదాపూర్‌లో హోటల్ నిర్వాహకులను బెదిరించి, ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు కొంతమంది వ్యక్తులపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు హోటల్‌కు వెళ్లి ఏదో సమస్యపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. “వెంటనే గుంపులోని కొంతమంది వ్యక్తులు హోటల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి సిబ్బందిని బెదిరించారు” అని మాదాపూర్ పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.