Tourist Bus Accident : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో టూరిస్ట్ బ‌స్సు బోల్తా.. 16 మందికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో టూరిస్ట్ బస్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 16 మంది ప‌ర్యాట‌కుల‌కు....

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 11:00 AM IST

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో టూరిస్ట్ బస్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 16 మంది ప‌ర్యాట‌కుల‌కు గాయాలైన‌ట్లు పోలీసులు తెలిపారు. బస్సు మనాలి నుంచి చండీగఢ్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మొత్తం గాయపడిన వారిలో ముగ్గురిని పిజిఐ చండీగఢ్‌కు రెఫర్ చేశామని, చాలామంది బిలాస్‌పూర్‌లో చికిత్స పొందుతున్నారని.. మరికొందరు ప్రథమ చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ రాయ్ తెలిపారు. డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.