Budget 2024: మధ్యంతర బడ్జెట్‌లో రైతుల‌కు గుడ్ న్యూస్ అందుతుందా..?

రాబోయే మధ్యంతర బడ్జెట్ (Budget 2024)లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించవచ్చు. అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా కూడా ఇది నిర్ధారిస్తుంది.

  • Written By:
  • Updated On - January 23, 2024 / 09:53 AM IST

Budget 2024: రాబోయే మధ్యంతర బడ్జెట్ (Budget 2024)లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించవచ్చు. అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా కూడా ఇది నిర్ధారిస్తుంది. సోర్సెస్ ఈ సమాచారం ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ఆర్థిక సంస్థలకు మూడు లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది. అంటే రైతులు ఏటా ఏడు శాతం రాయితీపై రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు పొందుతున్నారు.

సకాలంలో చెల్లించే రైతులకు ఏడాదికి మూడు శాతం అదనపు వడ్డీ రాయితీ కూడా అందజేస్తున్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకోవచ్చు. కానీ వడ్డీ రేటు మార్కెట్ రేటు ప్రకారం ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.22-25 లక్షల కోట్లకు పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అగ్రి-క్రెడిట్‌పై ప్ర‌భుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతోందని స‌మాచారం.మిగిలిపోయిన అర్హులైన రైతులను గుర్తించి వారిని క్రెడిట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక ప్రచారాలను నిర్వహిస్తోంది.

Also Read: Metro Rail Phase Two Plan: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 రూట్‌ మ్యాప్ ఖరారు.. కొత్తగా 70 కిలోమీట‌ర్లు, కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఇదే..!

కేంద్రీకృత విధానంలో భాగంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ‘క్రెడిట్’ (రుణాల కోసం)పై ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించిందని వర్గాలు తెలిపాయి. ఇది కాకుండా వివిధ వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల కోసం రుణ పంపిణీ గత 10 సంవత్సరాలలో లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2023 నాటికి రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంలో 82 శాతం సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ కాలంలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సుమారు రూ. 16.37 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ రూ.21.55 లక్షల కోట్లు. ఇది ఈ కాలానికి నిర్దేశించిన రూ.18.50 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ. డేటా ప్రకారం.. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) నెట్‌వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాలు పొందారు. మార్చి 31, 2023 వరకు దాదాపు రూ.8.85 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి.