పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 4 కిలోల అనుమానిత నిషిద్ధ వస్తువులను తీసుకెళ్తున్న పాకిస్తాన్ డ్రోన్ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సోమవారం కాల్చివేసినట్లు అధికారి తెలిపారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో సైనికులకు హమ్మింగ్ సౌండ్ వినిపించడంతో క్వాడ్కాప్టర్ గుర్తించబడింది. డ్రోన్కు ఒక చిన్న ఆకుపచ్చ రంగు బ్యాగ్ జతచేయబడిందని, అందులో పసుపు రంగులో నాలుగు ప్యాకెట్లు మరియు నలుపు రంగులో ఒక చిన్న ప్యాకెట్ ఉన్నాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.అనుమానిత నిషిద్ధ వస్తువు 4.17 కిలోలు, ప్యాకింగ్ మెటీరియల్తో పాటు, నలుపు రంగులో చుట్టబడిన ప్యాకెట్ బరువు 250 గ్రాములుగా ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రోన్ మోడల్ DJI మ్యాట్రిస్ 300 RTX గా గుర్తించారు.