KCR AP Tour : ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తొలిసారి..!

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా.....

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 07:26 AM IST

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా అనంతపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేన‌ప్ప‌టికీ సోమవారం లోపు వరద ప్రభావిత ప్రాంతాలను కేసీఆర్ సందర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. జాతీయ నాయకుడిగా ప్రజలకు చేరువయ్యేందుకు, వారితో మమేకమయ్యేందుకు ఈ ప్రయత్నం చేస్తామని పార్టీ నేతలు తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు చేరువయ్యారనే పేరు కేసీఆర్‌కు ఉందని టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. ఢిల్లీలో రైతుల నిరసనలో మరణించిన రైతుల కుటుంబాలకు, గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. వైజాగ్‌లో హుద్‌హుద్ తుఫానుతో రాష్ట్రం అతలాకుతలమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన అన్ని సహాయాలు అందజేస్తామని ముఖ్యమంత్రి ఒకప్పుడు ముందుకొచ్చారని టీఆర్‌ఎస్ నాయకులు గుర్తు చేసుకున్నారు