BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన BRS నేతలు

  • Written By:
  • Publish Date - April 27, 2024 / 06:34 PM IST

BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను BRS నేతలు కలిశారు. బీజేపీ అదిలాబాద్ ఎంపి అభ్యర్థి గోడం నగేష్,  రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షా, ఐఏఎస్ పై  BRS నేతలు దాసోజు, ఆశిష్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో పూర్తిగా ఫిలప్ చేయలేదని RO కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని సీఈఓ కు తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారి, రాజశ్రీ షా, ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓ ను కోరింది బీఆర్ఎస్ పార్టీ.

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా బీజేపీ కి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్ నామినేషన్ తిరస్కరించడానికి అన్ని ఆధారాలు చూపించినప్పటికీ రిటర్నింగ్ అధికారి తిరస్కరించలేదన్నారు. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎన్నికల అధికారులు బిజెపికి సహకరిస్తున్నారని దాసోజు అన్నారు.