Site icon HashtagU Telugu

BRS Case File : సీఎం రేవంత్ పై కేసు పెట్టేందుకు సిద్దమైన బిఆర్ఎస్

World Economic Forum

World Economic Forum

 

సీఎం రేవంత్ (CM Revanth) అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని బిఆర్ఎస్ నేత RS. ప్రవీణ్ (RS Praveen)అన్నారు. రాష్ట్ర ఆదాయం, ఉద్యోగ అవకాశాల పెంపునకు గత ప్రభుత్వం ‘మొబిలిటీ వ్యాలీ’ కార్యక్రమం పెట్టడానికి సంకల్పించిందని గుర్తుచేశారు. ఫార్ములా-ఈ రేసు నాలుగు సార్లు జరగాల్సి ఉందని, రేవంత్ వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయాయని ఆరోపించారు.

Deep Seek AI : అమెరికాకు చైనా ‘డీప్ సీక్’ కలవరం.. డౌన్‌లోడ్లలో నంబర్ 1.. ఎలా ?

ప్రవీణ్ తెలిపిన ప్రకారం.. ఫార్ములా-ఈ రేసును రాష్ట్రంలో నాలుగు సార్లు నిర్వహించాల్సి ఉండేదని, ఇది తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకువచ్చేదని అన్నారు. కానీ రేవంత్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రేసు నిలిచిపోయిందని, దీని వల్ల పెట్టుబడులు తగ్గి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు, యువతకు కొత్త అవకాశాలు కల్పించేందుకు మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని ప్రవీణ్ వెల్లడించారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఆపడం వల్ల జరిగిన నష్టానికి రేవంత్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇక ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేవంత్ వల్ల రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని, దీనిపై వెంటనే కేసు నమోదు చేయాలని ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.