మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో బోరుబావిలో బాలుడు పడిపోయాడు. సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు లోతైన బోరుబావిలో పడిపోయాడని.. జిల్లాలోని మాండవి గ్రామంలో సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం నానక్ చౌహాన్ అనే వ్యక్తి పొలంలో బోరు వేశాడు. అయితే నీళ్లు పడకపోవడంతో ఆ బోరుబావిని పట్టాతో కప్పి ఉంచానని పొలం యాజమాని తెలిపాడు. అయితే బాలుడు కవర్ను ఎలా తొలగించగలిగాడో తనకు తెలియదని చౌహాన్ పోలీసులకు చెప్పాడు. బాలుడిని సురక్షితంగా బయటకు తీయడానికి ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఆ ప్రాంతాన్ని తవ్వడానికి జేసీబీలు తెప్పించామని పోలీసులు తెలిపారు. బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. SDRF బృందం భోపాల్, హోషంగాబాద్ నుండి రప్పించారు.