Professor Saibaba: ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు..!!

ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది.

Published By: HashtagU Telugu Desk
Sai Baba

Sai Baba

ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. సాయిబాబాను దోషిగా నిర్దారిస్తూ…జీవిత ఖైతు విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన చేసిన అప్పీల్ కూడా కోర్టు అనుమతించింది.

తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జిఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌పై ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.

మార్చి 2017లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు సాయిబాబాతోపాటు ఇతర వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. అందులో ఒక పాత్రికేయుడు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి మావోయిస్టుల సంబంధాలు, దేశానికి వ్యతిరేకంగా పలు కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ నిబంధనల ప్రకారం GN సాయిబాబా ఇతరులను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

  Last Updated: 14 Oct 2022, 12:10 PM IST