Site icon HashtagU Telugu

Reliance Jio: జియోకు షాక్ ఇచ్చిన 11 కోట్ల మంది వినియోగదారులు.. కానీ..!

Powerful People In Business

Powerful People In Business

Reliance Jio: రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని నెలల క్రితం తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. దీని కారణంగా దాదాపు 11 కోట్ల మంది వినియోగదారులు జియోను విడిచిపెట్టారు. ఇదిలావుండగా దీని వల్ల పెద్దగా నష్టమేమీ జరగలేదని కంపెనీ తెలిపింది. 5G వినియోగదారుల సంఖ్య, కంపెనీ ఆదాయాలు పెరుగుతూనే ఉన్నాయని సంస్థ అధికారులు తెలిపారు. దీని కారణంగా మార్కెట్లో జియో పట్టు బలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ధరలు పెరిగినా పట్టు మాత్రం అలాగే ఉంది

జూలైలో Jio దాని రీఛార్జ్ ప్లాన్‌లను ఖరీదైనదిగా చేసింది. దీని కారణంగా చాలా మంది ఇతర కంపెనీలకు మారారు. టెలికాం రంగంలో ఇది సాధారణ విషయం. కానీ TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం జియో ఇప్పటికీ భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా కొనసాగుతోంది.

Also Read: UPI Pin Set Up With Aadhaar: యూపీఐ పిన్‌ని ఆధార్ కార్డు ద్వారా సెట్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

5జీ వినియోగదారుల సంఖ్య పెరిగింది

ధరలు పెరిగినప్పటికీ Jio 5G వినియోగదారుల సంఖ్య 130 మిలియన్ల నుండి 147 మిలియన్లకు పెరిగింది. అంటే మార్కెట్‌లో జియో పట్టు మరింత బలపడింది. దీనితో పాటు సంస్థ సగటు ఆదాయం (ARPU) కూడా 181.7 నుండి 195.1కి పెరిగింది.

5G మరియు FWA సేవలకు ప్రాధాన్యత

జియో తన కస్టమర్లకు అత్యుత్తమ 5G నెట్‌వర్క్‌ను అందించడంపై పూర్తిగా దృష్టి సారిస్తోంది. ధరలను పెంచడం ద్వారా కంపెనీ తన సేవలను మెరుగుపరిచింది. దీనితో పాటు జియో తన FWA సేవను కూడా విస్తరిస్తోంది. తద్వారా మరిన్ని గృహాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది.

11 కోట్ల మంది వినియోగదారులు జియోను విడిచిపెట్టారు

11 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వైదొలిగినప్పటికీ, దీని వల్ల కంపెనీకి పెద్ద సమస్య ఏమీ క‌ల‌గ‌లేదు. Jio తన 5G మరియు FWA సేవలతో మార్కెట్లో బలంగా ఎదుగుతోంది. ఇతర కంపెనీల కంటే ముందంజలో ఉండటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్న‌ట్లు ఈ నివేదిక‌లు తెలుపుతున్నాయి.