JP Nadda: బీజేపీ జాతీయ సమావేశాలకు నడ్డా శ్రీకారం!

బీజేపీ జాతీయ  సమావేశాల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆఫీస్ బేరర్స్ మీట్ నిర్వహించి, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

  • Written By:
  • Updated On - July 2, 2022 / 03:00 PM IST

బీజేపీ జాతీయ  సమావేశాల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆఫీస్ బేరర్స్ మీట్ నిర్వహించి, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 350 మంది ప్రతినిధులు జాతీయ కార్యవర్గానికి హాజరుకానున్నారు. జాతీయ కార్యవర్గం గత కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించి, పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తుంది. సమావేశాలను పురస్కరించుకొని హైదరాబాద్ కాషాయ రంగులతో ముస్తాబైంది. ఎక్కడా చూసినా బీజేపీ జెండాలు రెపరెపలాడున్నాయి. కార్యకర్తలు కదం తొక్కతున్నారు. బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్‌లను నగరవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల సమావేశం సందర్భంగా ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల బీజేపీ జెండాలతో దర్శనమిస్తున్నాయి.

నగరంలోని పలు చోట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిల భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ వేదిక హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసిసి)కి వెళ్లే రహదారులపై పార్టీ జాతీయ నాయకులు, ఇతర ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గం ముగింపు సందర్భంగా ఆదివారం జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ, ఇతర బీజేపీ జాతీయ నేతలు ప్రసంగించనున్న పరేడ్ గ్రౌండ్ చుట్టూ పలు కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.