Site icon HashtagU Telugu

BJP: ముస్లింల ఓటు హక్కును ఉపసంహరించుకోవాలి – బీహార్ బీజేపీ ఎమ్మెల్యే

Bjp

Bjp

ముస్లింల ఓటు హక్కును ప్రభుత్వం తొలగించాలని బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హరి భూషణ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. 1947లో దేశాన్ని మతం పేరుతో విభజించి మరో దేశాన్ని సంపాదించుకున్నారని..వారు వేరే దేశానికి వెళ్లాలని ఆయ‌న వ్యాఖ్యానించారు. వారు ఇక్కడ నివసిస్తున్నట్లయితే, వారి ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వారు (ముస్లింలు) భారతదేశంలో రెండవ తరగతి పౌరులుగా జీవించగలర‌ని బిజెపి ఎమ్మెల్యే హరిశంకర్ ఠాకూర్ అన్నారు.

దేశంలోని ముస్లింలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలని అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఠాకూర్ అన్నారు. ముస్లింలు దేశంలో ఐఎస్‌ఐ ఎజెండాను నడుపుతున్నారని, భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చే ఎజెండాతో వారు పనిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ దేశంలో ముస్లింలు మైనారిటీలేనని, రాజ్యాంగంలో మైనారిటీ అనే పదం లేదని హరిశంకర్ ఠాకూర్ అన్నారు.అయితే బీహార్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతున్నాయని, ఈ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వందేమాతరం పాడరని అక్తరుల్ ఇమాన్ చెప్పారు. సంప్రదాయం ప్రకారం, బీహార్ శాసనసభ సమావేశాలు జాతీయ గీతం జనగణమనతో ప్రారంభమై వందేమాతరంతో ముగుస్తాయి.

Exit mobile version