BJP: ధాన్యంపై దగుల్బాజీ రాజకీయం

సీఎం కేసీఆర్ దీక్షపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

  • Written By:
  • Updated On - April 11, 2022 / 08:54 PM IST

తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దీక్షపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దొంగ దీక్షలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ రాష్ట్రంలో చేసేదేమీ లేకనే ఢిల్లీకి వెళ్లి దీక్ష చేపట్టారన్నారు. తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలోలేని సమస్యలు తెలంగాణలో కేసీఆర్ ఎందుకు సృష్టించార‌ని ప్రశ్నించారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు…సైతం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ధాన్యంపై జరుగుతున్న రగడ అంతా కూడా దగల్బాజీ రాజకీయంగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధికారంలో వచ్చి తీరుతుందన్నారు.