ఇవాళ టీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తుండగా, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈటల రాజేందర్కు అవమానం జరిగింది. లోపలకి వెళ్లడానికి ప్రయత్నించిన ఆయనను ఒక దశలో పోలీసులు ఆపేశారు. వేరే గేట్ నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత ఈటల ఒక్కరినీ పోలీసులు లోపలికి పంపించారు.