Biometric Cloning: వేలిముద్రలు హ్యాక్ చేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!

హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.. చివరకు అమాయక ప్రజల ఫింగర్ ప్రింట్లను కూడా వదలడం లేదు.

  • Written By:
  • Updated On - May 7, 2022 / 05:08 PM IST

హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.. చివరకు అమాయక ప్రజల ఫింగర్ ప్రింట్లను కూడా వదలడం లేదు. ఫింగర్ ప్రింట్లను హ్యాక్ చేసి, ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ (Aeps) ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. ఈ ముఠా కు చెందిన నలుగురు సభ్యులను మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు మధ్యప్రదేశ్ లోని పలు కస్టమర్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరిస్తారు. వాటిని తమ రహస్య కేంద్రాలకు తీసుకెళ్లి స్కాన్ చేసి.. వేలిముద్రలను క్లోన్ చేస్తారు. అనంతరం ఆ వేలిముద్రల సాయంతో Aeps మార్గంలో .. సదరు ఆధార్ కార్డుదారుడి బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవుతారు. అందులోని డబ్బులను ఎంచక్కా తమ ఖాతాలలోకి పంపించుకుంటారు.

Aeps ఏమిటి ?

దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్ధిక లావాదేవీలను సులువుగా చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన వ్యవస్థే Aeps (ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ). పాయింట్ ఆఫ్ సేల్స్ (pos), మైక్రో ఏటీఎం ల వద్ద కేవలం ఆధార్ నంబరును చెప్పి డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంటుంది.