BCCI Prize Money: అండర్ – 19 విజేత కు బీసీసీఐ 5 కోట్ల నజరానా!

జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 11:56 AM IST

తొలిసారి నిర్వహించిన అండర్ – 19 మహిళల ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది టీమ్‌ఇండియా. జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ బుధవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.

మ్యాచ్‌కు ముందు అండర్ – 19 మహిళల ప్రపంచకప్‌ విజేతలను సత్కరిస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఇవాళ దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి భారత మహిళల అండర్ -19 జట్టు చేరుకొంటుంది. ‘‘అండర్ -19 మహిళల ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ జట్టు సభ్యులకు సచిన్‌ తెందూల్కర్, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్స్‌ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం.