Bandi Sanjay : 8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 06:23 PM IST

తెలంగాణలో రాజకీయ రాజుకుంటోంది. లోక్‌ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌ (Congress)లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎనిమిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. అయితే బీఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని, అవినీతి పార్టీలతో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని సంజయ్ విమర్శించారు. ఎన్డీయే (NDA) అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ను చేర్చుకోలేదని, అందుకే బీజేపీ ఇప్పుడు తమతో జతకట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు స్థానిక సమస్యలపై శ్రద్ధ చూపుతున్నారని సంజయ్‌ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీజేపీ సందర్శించిందని, ప్రాజెక్టు లోపాలను ఎత్తిచూపుతూ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక సమర్పించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి సొమ్మును రికవరీ చేయడంపై సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి) (KRMB) అంశంపై బిఆర్‌ఎస్ మాట్లాడిందని సంజయ్ విమర్శించారు, కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు “రజాకార్లు”, ఎంఐఎం (AIMIM) పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో పోటీ కాంగ్రెస్-బీజేపీ మధ్యేనని, దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్‌లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగులుతుందని సంజయ్ హెచ్చరించారు.

Read Also : TDP-JSP : లిస్ట్‌ విడుదలలో జాప్యం.. టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల్లో కలవరం