Andhra Adivasi: మన్యంలో వాటర్ వార్

ఏపీలోని మన్యం ప్రాంతాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Water

Water

ఏపీలోని మన్యం ప్రాంతాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి. కనీసం తాగడానికి చుక్కానీరు లేక దాహమో రామచంద్రా అంటూ రోడ్డుక్కెతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మూలపేట పంచాయతీలోని జాజులు బంధ గ్రామస్తుల తాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నాయి. ఈ గ్రామంలో ఉన్న 170 మంది కొందు తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులు చాపరాయి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అది కూడా సురక్షితమైన నీరు కాదు ఆదివాసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలం ఆ చాపరాయి నాచు పట్టి ప్రమాదకరంగా మారుతుంది. ఈ జాజులు బంధ గ్రామస్తుల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్ళాలి. గత జూన్ నెలలో శాంతి అనే గర్భిణిని ప్రసవం కోసం డోలీలో 9 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గిరిజనుల కష్టాలను గుర్తించి, వారికి సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలి. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదివాసీలతో పాటు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

  Last Updated: 08 Aug 2022, 05:17 PM IST