ఏపీలోని మన్యం ప్రాంతాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి. కనీసం తాగడానికి చుక్కానీరు లేక దాహమో రామచంద్రా అంటూ రోడ్డుక్కెతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మూలపేట పంచాయతీలోని జాజులు బంధ గ్రామస్తుల తాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నాయి. ఈ గ్రామంలో ఉన్న 170 మంది కొందు తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులు చాపరాయి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా సురక్షితమైన నీరు కాదు ఆదివాసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం ఆ చాపరాయి నాచు పట్టి ప్రమాదకరంగా మారుతుంది. ఈ జాజులు బంధ గ్రామస్తుల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్ళాలి. గత జూన్ నెలలో శాంతి అనే గర్భిణిని ప్రసవం కోసం డోలీలో 9 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గిరిజనుల కష్టాలను గుర్తించి, వారికి సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలి. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదివాసీలతో పాటు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, మూలపేట పంచాయతీలోని జాజులు బంధ గ్రామస్తుల తాగునీటి కష్టాలు ఇవి. ఈ గ్రామంలో ఉన్న 170 మంది కొందు తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులు చాపరాయి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి తాగునీరు తెచ్చుకోవాలి. అది కూడా సురక్షితమైన నీరు కాదు. (1/3) pic.twitter.com/qLvLexQizh
— Telugu Desam Party (@JaiTDP) August 8, 2022