APSRTC: హైదరాబాద్ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే గరుడ, నైట్ రైడర్, ఇంద్ర, అమరావతి, వెన్నెల స్లీపర్ సర్వీసులు

Published By: HashtagU Telugu Desk
APSRTC

APSRTC

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే గరుడ, నైట్ రైడర్, ఇంద్ర, అమరావతి, వెన్నెల స్లీపర్ సర్వీసులు వివిధ ఎయిర్ కండిషన్డ్ బస్సుల టిక్కెట్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మంగళవారం ప్రకటించింది. విజయవాడ, మచిలీపట్నం, ఆటో నగర్, గుడివాడ బస్ డిపోల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఫిబ్రవరి 28 వరకు రాయితీ వర్తిస్తుందని APSRTC రీజినల్ మేనేజర్ ఎం యేసు దానం తెలిపారు.

హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు ఆదివారం మినహా అన్ని రోజుల్లో హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు శుక్రవారం మినహా అన్ని రోజులలో తగ్గింపు ఛార్జీలు వర్తిస్తాయి. గరుడ సర్వీస్ మచిలీపట్నం-బీహెచ్‌ఈఎల్‌కు సాధారణ రోజుల్లో రూ. 785, రాయితీ తర్వాత రూ.685. డిస్కౌంట్ తర్వాత మచిలీపట్నం-బీహెచ్‌ఈఎల్, నైట్ రైడర్ సీటు ధర రూ.640 మరియు నైట్ రైడర్ బెర్త్  రూ.800, గుడివాడ-బీహెచ్‌ఈఎల్ (ఇంద్ర) రూ.555, విజయవాడ-హైదరాబాద్ (అమరావతి) రూ.535.

  Last Updated: 26 Jan 2022, 01:43 PM IST