Hyderabad: గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఊరువాడా గణేష్ విగ్రహాలతో సందడి నెలకొననుంది. ఈ నెల సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థితి. ఇందుకోసం ఇప్పటికే ఆలయ కమిటీలు వేసుకున్నారు. ఇదిలా ఉండగా పండుగకు ముందు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపుల కోసం పోలీసులు దరఖాస్తులను ఆహ్వానించారు. ఫారమ్ను పూరించేటప్పుడు, దరఖాస్తుదారులు వారి పేరు, చిరునామా, సంఘం పేరు మరియు ఇన్స్టాలేషన్ వివరాల వంటి వివరాలను తప్పనిసరిగా అందించాలి. ప్రతిష్ఠాపన వివరాలలో తప్పనిసరిగా విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ మరియు రవాణా విధానం, ఇతర విషయాలు కూడా పొందుపర్చాలి. ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు ఈ ఏడాది హైదరాబాద్తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు జరగనున్నాయి. పండుగకు ముందు సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్స్ పేల్చడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలు సజావుగా నిర్వహించేందుకు పౌరులందరూ శాంతి, ప్రశాంతతలను కాపాడాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.
Hyderabad: గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు దరఖాస్తులు ఆహ్వానం
గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఊరువాడా గణేష్ విగ్రహాలతో సందడి నెలకొననుంది. ఈ నెల సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థితి. ఇందుకోసం ఇప్పటికే ఆలయ కమిటీలు వేసుకున్నారు.

New Web Story Copy 2023 09 12t150424.425
Last Updated: 12 Sep 2023, 03:04 PM IST