Site icon HashtagU Telugu

Telangana: 3 వ్యవసాయ వర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

Telangana

Telangana

Telangana: తెలంగాణాలో 3 వ్యవసాయ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బైపీసీ చేసిన విద్యార్థులు జూలై 12 మరియు ఆగస్టు 17 మధ్య దరఖాస్తు చేసుకోని దరఖాస్తుదారులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU), PV నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం (PVNRTSVU), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU)లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 29 వరకు పొడిగించబడింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రుల అభ్యర్థనపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బైపీసీ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు జూలై 12 నుండి ఆగస్టు 17 వరకు ఈ విశ్వవిద్యాలయాల పరిధిలో వివిధ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారని పిజెటిఎస్‌ఎయు రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామి రెడ్డి తెలియజేశారు. అయితే ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఇప్పటికీ ఈ విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Also Read: Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు