Death Sentence: రమ్య హంతకుడికి ఉరిశిక్ష!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై నేడు కోర్టు తీర్పు వెలువరించింది.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 05:18 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై నేడు కోర్టు తీర్పు వెలువరించింది. ఈమేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు హంతకుడికి ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టు 15న రమ్య హత్య జరగ్గా… డిసెంబర్‌లో విచారణ ప్రారంభమైంది. ఈనెల 26న కేసు విచారణ ముగిసింది. నేడు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై సీఎం జగన్, టీడీపీ నేత నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.  గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.

శశికృష్ణకు ఉరిశిక్ష

సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ప్రేమ కాదన్నదన్న కోపంతో గత ఏడాది ఆగస్ట్ 15వ తేదిన పబ్లిగ్గా నడిరోడ్డుపై రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య విజువల్స్ సిసి కెమెరాలో రికార్డయ్యాయి. అదే కేసులో ప్రధాన సాక్షిగా నిలిచింది. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేయటంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. రమ్య శరీరంపై 8 కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు . సాక్షాధారాలు లభించటంతో పాటు ప్రత్యక్షంగా హత్య చూసిన వారు కూడా విచారణకు సహకరించారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి వాదించారు. నిందితుడు శశికృష్ణ గుంటూర్ జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హంతకుడికి ఉరిశిక్ష విధించింది కోర్టు.

అంతటా ఉత్కంఠత

ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు చేశాయి. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. రమ్య హత్య కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఏపీలోని దిశా చట్టం ఎట్టకేలకు హంతకుడికి ఏడాది తిరగకముందే ఈ శిక్ష వేసేలా చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది.