TDP : టీడీపీతోనే బీసీల‌కు న్యాయం – ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు

టీడీపీ పార్టీని స్థాపించి సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీలకు ప్రాధాన్యత వచ్చిందని ఏపీ టీడీపీ

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 09:32 PM IST

టీడీపీ పార్టీని స్థాపించి సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీలకు ప్రాధాన్యత వచ్చిందని ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎన్టీఆర్ 27% రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేస్తూ ..దానిని చంద్రబాబు బీసీలకు 34 శాతానికి పెంచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విభజించి పాలించు విధానాన్ని అవలంబిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 54 కార్పొరేషన్లు ఏర్పాటైనా నామమాత్రంగానే మిగిలిపోయాయని, జనాభా గణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.