ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా మహిళలను నియమించనుంది. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు, శిక్షణ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను సాంఘిక సంక్షేమ శాఖ త్వరలో విడుదల చేయనుంది. 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకు ఇప్పటికే ప్రాథమిక ఆదేశాలు అందాయి. 10వ తరగతి చదివిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు. మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు.
అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఉమ్మడి జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్ పాఠశాలల్లో 32 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్సులోనే శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్టీసీకి చెల్లింపులు చేస్తుంది. డ్రైవింగ్లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తారు. ఈ అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా మొదటి దశలో, RTC లో ఖాళీగా ఉన్న SC బ్యాక్లాగ్ పోస్టులకు వారిని నియమించాలని ప్రతిపాదించబడింది. అర్హులైన అభ్యర్థుల ఎంపికకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఎంపికైన ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా హెవీ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలిదశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్ లాగ్ డ్రైవర్ పోస్టుల్లో నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.