ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లబ్దిదారులకు మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులను జగన్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం అయిన తర్వత తొలిసారిగా జగన్ కుప్పం వెళ్తుండటంతో రాజకీయం వెడెక్కింది. ఈ సారి కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని వైసీపీ అధిష్టానం పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ సభలో కుప్పంకు ఎలాంటి నిధులు ప్రకటిస్తారనే ఉత్కంఠ నెలకొంది.సీఎం జగన్ పర్యటన సందర్భంగా కుప్పం నిండా వైసీపీ జెండాలు, సీఎం కటౌట్లు, బ్యానర్లే కనిపిస్తున్నాయి.