నేడు హైదరాబాద్కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈ మేరకు శ్రీ రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ హైదరాబాద్కు బయలుదేరుతారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముచ్చింతల్ కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు రామానుజాచార్యుల ఆశ్రమంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి గన్నవరం చేరుకుంటారు.